ఆర్టీసీ గుడ్ న్యూస్…బుక్ చేసుకుంటే ఇంటివద్దకే బస్సులు..!

-

నష్టాల నుండి లాభాల్లోకి వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ఆర్టీసి మరో కీలక నిర్ణయం తీసుకుంది. దసరా పండుగకు సొంత ఊర్లకు వెళ్ళే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఒకే కాలనీ లో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లయితే వారికోసం ప్రత్యేక బస్సును కాలనీ కే పంపిస్తున్నట్టు ప్రకటించింది. అయితే దానికోసం బస్సును ముందు గానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

బుక్ చేసుకున్న తర్వాత బస్సు కాలనీ కే వస్తుంది. ఈరోజు నుండి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో కొన్ని కాలనీలలో ఒకే ప్రాంతం నుండి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వారు ఊరికి వెళ్ళాలి అనుకుంటే ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక దసరా పండగ సందర్భంగా హైదరాబాద్ నలు మూలల నుండి బస్సులు ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news