గ్రూప్‌-2 అభ్యర్థులకు పరీక్షా తేదీలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

-

TS Group-2 | గ్రూప్‌-2 పరీక్షా తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మంగళవారం ప్రకటించింది. ఆగస్ట్‌ 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షకు వారం ముందు నుంచి అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించింది. 783 పోస్టుల కోసం గతేడాది డిసెంబర్‌ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. జనవరి 18 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గ్రూప్‌-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 705 మంది దరఖాస్తు చేసుకున్నారు.

TS Group-2 | గ్రూప్‌-2 అభ్యర్థులకు అలెర్ట్‌.. పరీక్షా తేదీలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీయస్సీ గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 16తో ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 783 పోస్టులకుగానూ రాష్ట్రవ్యాప్తంగా 5,51,901 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 18 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభంకాగా చివరి మూడు రోజుల్లోనే 1.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీపడనున్నారు. పరీక్ష తేదీ ఈ రోజు ఖరారు చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news