సీఎం జగన్ వ్యాఖ్యలకు సోమిరెడ్డి కౌంటర్

-

తెనాలిలో నేడు జరిగిన రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…దుష్ట చతుష్టయానికి దత్తపుత్రుడు కూడా తోడయ్యాడని… చంద్రబాబుకు, దత్తపుత్రుడికి దమ్ముంటే రాష్ట్రంలో 175 స్థానాల్లో పోటీ చేయాలని సీఎం జగన్ ఇవాళ సవాల్ విసరడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించి వెంటనే కౌంటర్ ఇచ్చారు.

Somireddy counters CM Jagan challenge

 

అసలు, మీతో ఏ ఒక్క పార్టీ అయినా కలుస్తుందా? అని ఎద్దేవా చేశారు. జగన్ 175 స్థానాల గురించి మాట్లాడుతున్నారు… కనీసం ఒక్క స్థానంలో అయినా మీతో కలిసి నడిచే పార్టీ ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు. “ఆర్థిక నేరస్తుడు జగన్ తో ఎవరు పొత్తు పెట్టుకుంటారని, పాలనాధికారం ఇచ్చిన ప్రజలనే మోసగించిన వ్యక్తి జగన్” అని విమర్శించారు. ఒంటరిగా పోటీ చేయడం టీడీపీకి కొత్త కాదని సోమిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 1983 నుంచి పలు ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ చేసిందని గుర్తు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news