గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ స‌ర్కార్‌ గుడ్​న్యూస్​..

-

గ్రూప్ 1 అభ్యర్థులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రూప్ వన్ దరఖాస్తులను సవరించుకునేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవకాశం కల్పించింది. ఈనెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టిఎస్పిఎస్సి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సవరించుకోవచ్చునని కమిషనర్ కార్యదర్శి తెలిపారు. మార్పులు చేసుకునే వివరాలకు ఆధారంగా తగిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని టిఎస్పిఎస్సి వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్రంలో 503 ఉద్యోగాల కోసం సుమారు 3,80,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే తాము కొన్ని పొరపాట్లు చేశామని ఎడిట్ చేసే అవకాశం ఇవ్వాలని పలుగురు అభ్యర్థులు కోరడంతో టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ వన్ దరఖాస్తులకు మే రెండు నుంచి కమిషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. తొలిత రోజువారి దరఖాస్తులు తక్కువ సంఖ్యలో వచ్చినప్పటికీ గడువు ముగుస్తున్న కొద్ది భారీ సంఖ్యలో వచ్చాయి. దీంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య దాదాపు నాలుగు లక్షల చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news