Breaking : TSPSC పేపర్ లీకేజీ ఎఫెక్ట్.. మరో పరీక్ష వాయిదా

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్న సిట్ కు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పటికే లీకేజీ నేపథ్యంలో నాలుగు నోటిఫికేషన్ల పరీక్షలను కమిషన్‌ రద్దు చేయగా, రెండింటిని వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

మరో నియామక పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. జూన్ 17 న మళ్లీ ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

గ్రూప్‌-1 ప్రిలిమినరీతో పాటు డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి(డీఏవో), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ), అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) పరీక్షలు రద్దు కాగా.. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(టీపీబీవో), వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని కమిషన్‌ ఇప్పటికే ఖరారు చేసింది. ఈ పరీక్షను జూన్‌ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మిగతా రద్దయిన పరీక్షలతో పాటు వాయిదా పడిన వాటికి మరో రెండ్రోజుల్లో కొత్త తేదీలు వెల్లడించే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news