TSRTC : అదే బస్సుల యజమానులతో ఆర్టీసీ చర్చలు సఫలం…

-

అద్దె బస్సు ఓనర్లతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని టి.ఎస్.ఆర్.టి.సి ఎండి సజ్జనర్ వెల్లడించారు. మా సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకి వెళ్తామని అదే బస్సు ఓనర్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.బస్ భవన్ లో అద్దె బస్సు ఓనర్ల తో ముగిసిన చర్చల అనంతరం మీడియాతో ఎండి సజ్జనర్ మాట్లాడారు. అద్దె బస్సు ఓనర్లు తమ దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు సజ్జనర్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని సజ్జనర్ వాళ్లకి హామీ ఇచ్చారు.

రేపటినుండి ఎలాంటి సమ్మె ఉండదని అద్దె బస్సులు ఎప్పటిలాగే నడుస్తాయని స్పష్టం చేశారు.త్వరలోనే సంక్రాంతి పండుగకి ఫ్రీ బస్ సౌకర్యంతో పాటు స్పెషల్ బస్సులను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు తెలిపారు.కాగా, అంతకుముందు అద్దె బస్సు ఓనర్ల సంఘం నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news