తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ !

-

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్రము ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు అందరినీ చక్కగా చూసుకుంటూ ప్రభుత్వంపై వ్యతిరేకత లేకుండా జాగ్రత్త పడుతోంది. ఇందుకు అవసరం అయిన పధకం, నిధులు లేదా ఉద్యోగుల పెండింగ్ విషయాలు అన్నటినీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళుతోంది. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ లపై నిర్ణయం తీసుకుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆర్టీసీ ఎండీ గా ఉన్న సీపీ సజ్జనార్ ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన కరువు భత్యాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చింది. 2023 జనవరి నెల నుండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన 5 శాతం డీఏ మంజూరు చేస్తున్నట్లు ఎండీ తెలిపారు. ఈ డీఏ ను సెప్టెంబర్ నెల జీతంతో కలిపి ఇస్తామని సజ్జనార్ తెలియచేశారు. ఇక ఆర్టీసీ కష్టాల్లో ఉన్న సమయంలోనూ ఉద్యోగులకు ఇవ్వాల్సిన 8 డీఏ లను ఇస్తూ వచ్చామని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.

ఇక మరో మూడు నాలుగు నెలల్లో తెలంగాణాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news