ఎయిర్ పోర్ట్ లో మిస్సయిన మహిళ కేసులో మరో ట్విస్ట్.. వేరే వ్యక్తితో ?

-

కువైట్ నుంచి వచ్చి గన్నవరం ఎయిర్ పోర్టుకి వచ్చి అక్కడ అదృశ్యమైన దుర్గ కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమె కువైట్ లో ఉన్నప్పటినుంచి వేరే వ్యక్తితో మాట్లాడుతున్నట్టు గా పోలీసులు గుర్తించారు. ఆమె ఫోన్ నెంబర్ తాలూకా కాల్ లిస్ట్ తీసిన పోలీసులకు ఈ విషయం రూఢీ అయినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రకాశం, కడప జిల్లాలకు రెండు బృందాలను పోలీసులు పంపించారు. కువైట్ లో దుర్గతో పనిచేసే వ్యక్తితో ఆమె వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి దుర్గ ఆచూకీ లభించే అవకాశం కనిపిస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రకు చెందిన దుర్గ రెండేళ్ల క్రితం కువైట్ కు పని కోసం వెళ్ళింది. ఈ నెల 15వ తారీఖున భర్త కు ఫోన్ చేసి తాను మరో రెండు మూడు రోజుల్లో ఆంధ్రాకి వస్తున్నానని వచ్చే ముందు ఫోన్ చేసి చెబుతాను అని పేర్కొంది. అయితే ఆమె నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాకపోవడంతో ఆమె ఇంకా బయలుదేరలేదేమోనని భర్త భావించాడు. కానీ ఆమెతో పాటు పని చేసే మరో మహిళ దుర్గ క్షేమంగా ఇంటికి చేరిందా అంటూ మెసేజ్ చేయడంతో ఆమె కువైట్ నుంచి బయలుదేరిన సంగతి తెలుసుకుని గన్నవరం ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీ కెమెరాలలో చూసి ఆమె 17వ తారీఖున వచ్చినట్లు గా గుర్తించారు. అప్పటి నుంచి పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news