షాకింగ్.. ఆ రెండు ఫ్లాట్ల విలువ రూ.111 కోట్లట..!

-

ముంబైలోని హై రైజ్ వొర్లిలో నూతనంగా నిర్మాణమవుతున్న ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లను అభయ్ సొయ్, తరుణ సొయ్ అనే ఇద్దరు సోదరులు రూ.111 కోట్లకు కొనుగోలు చేశారు.

దేశంలో ఏ ప్రాంతంలో చూసినా ప్రస్తుతం అన్ని రంగాలు మందగమనంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగమైతే కుదేలవుతోంది. అయితే ముంబైలో మాత్రం అందుకు పరిస్థితి భిన్నంగా ఉందనే చెప్పవచ్చు. అక్కడి ఖరీదైన ఏరియాల్లో ఇల్లు లేదా ప్లాట్ కొనాలంటే బిలియనీర్ అయి ఉండాల్సిందే. అవును నిజమే. ఎందుకంటే ముంబైలోని ఆ ప్రాంతంలో కొత్తగా నిర్మాణమవుతున్న ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లను ఇద్దరు సోదరులు ఏకంగా రూ.111 కోట్లకు కొనుగోలు చేశారు. అవును.. షాకింగ్ ఉన్నా.. ఇది నిజంగా.. నిజమే..!

two brothers bought two flats in hi rise worli for rs 111 crore

ముంబైలోని హై రైజ్ వొర్లిలో నూతనంగా నిర్మాణమవుతున్న ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లను అభయ్ సొయ్, తరుణ సొయ్ అనే ఇద్దరు సోదరులు రూ.111 కోట్లకు కొనుగోలు చేశారు. అభయ్ ముంబైలోని ఓ హాస్పిటల్ హెడ్‌గా పనిచేస్తుండగా, వీరిద్దరూ సదరు అపార్ట్‌మెంట్‌లోని 36, 37 ఫ్లోర్లలో చెరొక ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం సుమారుగా 730 చదరపు మీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఆ అపార్ట్‌మెంట్ నిర్మాణంలో ఉంది.

కాగా అభయ్ తన ఫ్లాట్‌కు రూ.54 కోట్లు చెల్లించగా, తరుణ రూ.57.25 కోట్లు ఖర్చు పెట్టాడు. 5304, 5204 నంబర్లు ఉన్న ఫ్లాట్లను వారు కొనుగోలు చేశారు. కాగా ఇద్దరూ కలిసి తమ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీనే ఏకంగా రూ.6.50 కోట్లు చెల్లించారట. ఆగస్టు 19వ తేదీన ఆ డీల్ జరిగినట్లు తెలిసింది. అయితే ఆ ఇద్దరు సోదరులకు ముంబైలోని ఇతర ఖరీదైన ప్రాంతాల్లో రూ.కోట్ల విలువ చేసే ఇండ్లు ఇప్పటికే ఉన్నాయట. ఈ క్రమంలోనే వారు తాజాగా ఆ ఫ్లాట్లను కొనుగోలు చేశారు. అవును మరి, పైసా ఉంటే ఏదైనా సాధ్యమే.. అందుకు ఈ ఇద్దరు సోదరులే బెస్ట్ ఎగ్జాంపుల్..!

Read more RELATED
Recommended to you

Latest news