ఇద్దరు పిల్లలను రేప్ చేసిన కామాంధుడు…!

-

ఒక పక్క కరోనా లాక్ డౌన్ ఉన్నా సరే దేశంలో రేప్ సంఘటనలు ఏదోక మూల జరుగుతూనే ఉన్నాయి. కరోనా విలయతాండవం చేస్తున్నా సరే రేప్ ఘటనలు మాత్రం జరగడం ఆందోళన కలిగించే అంశం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… చిత్రకూట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇద్దరు బాలికలను వారి బంధువు అత్యాచారం చేసినట్లు…

బుధవారం మధ్యాహ్నం ఇంటి బయట ఇద్దరు ఏడు, ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలు ఆడుకుంటున్నారు. బల్వీర్ సింగ్ అనే 32 ఏళ్ళ వ్యక్తి… ఆ ఇద్దరినీ ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేసాడని… రాజపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఫిర్యాదులు వచ్చాయని ఎస్‌హెచ్‌ఓ గులాబ్ చంద్ర త్రిపాఠి మీడియాకు వివరించారు.

బాలికల కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకోగా నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బాధిత బాలికల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆయన కేసు నమోదు చేసామని ఆయన పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవటానికి గాలింపు చేపట్టామని… రేప్ కి గురైన ఇద్దరు బాలికలను వైద్య పరీక్ష కోసం పంపినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news