జగన్ అక్రమాస్తుల కేసులో ఇద్దరు ఐఏఎస్ లకు ఊరట..

-

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఊరట లభించింది. ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, ఆదిత్య నాథ్‌దాస్‌కు ఊరట కల్పిస్తూ ఆ  ఇద్దరిపై ఉన్న కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అయితే, ప్రాసిక్యూషన్ కు అనుమతి తీసుకోకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సుప్రీంకోర్టు వెళ్లేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) గడువు కోరగా.. నాలుగు వారాలు తీర్పు అమలు నిలిపి వేసేందుకు హైకోర్టు అంగీకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news