బ్రేకింగ్ : ఛత్తీస్గఢ్ లో ఇద్దరు జవాన్లు సూసైడ్..

-

ఛత్తీస్‌ గఢ్‌ లోని సుక్మా, బీజాపూర్‌ జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు జవాన్లు తమ సర్వీస్‌ రివాల్వర్‌లతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సుక్మా జిల్లా లోని పుష్పల్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిన్న ఉదయం దినేశ్ వర్మ (35) అనే జవాన్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ 4వ బెటాలియన్‌లో విధులు నిర్వహస్తున్నట్టు సమాచారం.

సెలవుపై ఇంటికి వెళ్లి తిరిగి ఈ నెల 26న విధుల్లో చేశారు దినేశ్‌ వర్మ. అయితే కొద్ది రోజులుగా మానసిక ఆందోళనకు గురవుతున్న ఆయన అదే కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక అదేరాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలోని పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వినోద్‌ పోర్సే (29) అనే జవాన్‌ కూడా నిన్న ఉదయం వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా తన సర్వీస్ రివాల్వర్‌ తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒకే రోజు ఇద్దరు రక్షణ విభాగానికి చెందిన జవాన్లు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news