టీమిండియాకు భారీ షాక్.. ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం..!

-

ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీ ముగియగానే అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది భారత జట్టు అయితే. భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఐపీఎల్లో గాయం బారిన పడడంతో ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అంతేకాకుండా భారత జట్టులో మరో కీలక ఆటగాడైనా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.

వీరిద్దరూ కూడా ప్రస్తుతం ఆస్ట్రేలియా జరగబోయే నాలుగు టెస్టు సిరీస్ లకు ఎంపికయ్యారు. అయితే వీరిద్దరూ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించడానికి మరి కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి ఈ క్రమంలోనే.. వారు ఆస్ట్రేలియాలోని టెస్టు జట్టులో చేరే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి ఆస్ట్రేలియా వెళ్లినప్పటికీ అక్కడ 14 రోజులపాటు క్వారంటైన్ నిబంధనలు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి ప్రాక్టీస్ లేకుండా ఉంటుంది. తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి.. వీరు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు ప్రస్తుతం బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news