దారుణం : అప్పు తీర్చలేదని ‘అది’ కోసేశారు

-

ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలు కూడా మనుషులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. క్షణికావేశానికి లోనై తమ జీవితాన్ని అంతం చేసుకోవడానికి అలాగే ఇతరుల జీవితాన్ని అంతం చేయడానికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన వద్ద అప్పు తీసుకున్న వ్యక్తి ఎంతకు అప్పు తీరకపోవడంతో అప్పు ఇచ్చిన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా తనకు అప్పు డబ్బులు తిరిగి చెల్లించలేదని కక్ష పెట్టుకొని ఇద్దరు వ్యక్తులు కలిసి తన స్నేహితుడి మర్మాంగాలను కోసి వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

attack

ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పట్ జిల్లా లోని ఈద్గా మొహల్లాకు చెందిన సమీర్ కు ఇటీవల పెళ్లి కుదిరింది. అయితే కరోనా కారణంగా లక్ష రూపాయలు అప్పు చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు. మరలా తిరిగి చెల్లించలేదు. ఈ అప్పు కోసం ఎన్నో మార్లు అడిగి అడిగి అడిగి విసిగిపోయిన అతని స్నేహితులు ఇక ఇలా కాదని నమ్మకంగా స్నేహితుడిని పిలిచి అతని మర్మాంగాలను కోసి వేశారు. ఇక ఇప్పుడు సమీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version