ఉమేశ్ యాదవ్‌ను మోసం చేసిన మేనేజర్.. స్నేహితుడని చేరదీస్తే.. నమ్మకద్రోహం!

-

టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ కు బిగ్ షాక్ తగిలింది. స్నేహితుడని నమ్మి పని ఇస్తే నట్టింట ముంచేశాడు. ఫ్లాట్ కొనుగోలు పేరిట ఉమేష్ యాదవ్ ను బురిడీ కొట్టించి రూ. 44 లక్షలు ఎగనామం పెట్టాడు. విషయంలోకి వెళితే, మహారాష్ట్రలోని నాగపూర్ లోని కోరాడి పట్టణానికి చెందిన శైలేష్ ఠాక్రె (37) తో ఉమేష్ యాదవ్ కు ఎంతో కాలంగా స్నేహం ఉంది.

శైలేష్ కు ఉద్యోగం లేకపోవడంతో ఉమేష్ తన మేనేజర్ గా జూలై 2014లో నియమించుకున్నాడు. ఎంతో నమ్మకంగా ఉండటంతో శైలేష్ కు ఆర్థిక వ్యవహారాలు కూడా అప్పగించారు. ఉమేష్ యాదవ్ బ్యాంకు ఖాతాలు, ఆదాయపన్ను లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ శైలేష్ చక్కపెట్టేవాడు. ఈ క్రమంలో రూ. 44 లక్షలకే భూమి ఇప్పిస్తానని ఉమేష్ ను నమ్మించి ఆ ఫ్లాట్ ను తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకొని క్రికెటర్ ఉమేష్ యాదవ్ నివ్వెరపోయాడు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news