రాజమండ్రి వైసీపీలో ఊహించని పరిణామం.. వర్గపోరుకు స్వస్తి..!!

-

రాజమండ్రి వైసీపీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రెండు వర్గాలుగా ఉన్న వైసీపీ ఇప్పుడు ఒక్కటైపోయింది. మూడేళ్లుగా కొనసాగిన వర్గపోరుకు స్వస్తి పలికి.. ఒకే సైన్యంగా మారారు. ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతులు కలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే ధ్యేయంగా పని చేయనున్నారు. ఒకానొక సమయంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే రాజా మధ్య విభేదాలు ఓ రేంజ్‌లో నడిచాయి. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న పోరుతో కార్యకర్తలు కూడా విసిగిపోయారు.

ఎంపీ భరత్-ఎమ్మెల్యే రాజా
ఎంపీ భరత్-ఎమ్మెల్యే రాజా

వైసీపీలో ఇటీవల జరిగిన సంస్థాపన మార్పుల్లో వర్గపోరుకు చెక్ పెట్టేశారు. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్లుగా ఎంపీలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుడిగా నియామకం అయ్యాక.. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎవరూ ఊహించని విధంగా ఎంపీ భరత్ ఇంటికి వెళ్లారు. దీంతో వారిద్దరి మధ్య వర్గపోరుకు ఎండ్ కార్డ్ పడింది.

Read more RELATED
Recommended to you

Latest news