ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం

-

Union Cabinet meeting chaired by Prime Minister Modi today: ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరునుంది. ఢిల్లీలో నేడు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరునుంది.

Union Cabinet meeting chaired by Prime Minister Modi today

ఈ సందర్బంగా పలు కీలక అంశాలపై చర్చ నిర్వహించారు కేంద్ర కేబినెట్ సభ్యులు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో సారి కేబినెట్‌ భేటీ కాబోతుంది.కాగా మోడీ తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకునే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం జూన్ 30 నుండి పునః ప్రారంభమవుతుందని మోడీ ఇవాళ తెలిపారు.ఆయన తన సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో వ్యాఖ్యానిస్తూ, సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించలేదు,

కొన్ని నెలల విరామం తర్వాత ఇప్పుడు తిరిగి వస్తుంది అని అన్నారు. ఈ నెల కార్యక్రమం ఆదివారం, 30 జూన్ నాడు ప్రసారం కానుంది.దీని కోసం మీ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోవాలని నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. MyGov ఓపెన్ ఫోరమ్, NaMo యాప్‌లో లేదా 1800 11 7800 నంబర్‌లో మీ అభిప్రాయాలను పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news