8 రాష్ట్రాల సీఎంల‌తో అమిత్ షా భేటీ…పాల్గొన్న కేసీఆర్ !

-

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్య మంత్రు లతో కేంద్ర హోం శాఖ మంత్రి భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభం అయింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి మరియు ఇతర సమస్య లపై చర్చ జరుగనుంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు మరియు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం తరఫున ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు సుచరిత పాల్గొన్నారు.

మొన్న ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కాలు బెనికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లోనే ఢిల్లీ టూర్‌ రద్దు చేసుకున్నారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. దీంతో సీఎం జగన్‌ స్థానం లో హోం మంత్రి సుచరిత ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఒడిస్సా, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కాగా.. నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. కేంద్ర జల్‌ శక్తి మంత్రిని కలిసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news