అన్ స్టాపబుల్: ఆగని ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ 2.. ఈరోజే..!

-

రెబల్ స్టార్ ప్రభాస్ బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ కి సంబంధించిన ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ క్రమంలోనే అభిమానుల కోరిక మేరకు బాహుబలి పార్ట్ వన్ ఒకరోజు ముందే స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ లో ప్రభాస్ ఒక్కడే పాల్గొన్నారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ప్రభాస్ ఫ్రెండ్ గోపీచంద్ కూడా హాజరు కాబోతున్నారు. మొదటి పార్ట్ లో బాలకృష్ణ , ప్రభాస్ మధ్య జరిగిన సంభాషణ చాలా సరదాగా సాగింది.

బాలకృష్ణ తనదైన శైలిలో ప్రభాస్ ను ఒక ఆట ఆడుకున్నాడు. తికమక పెట్టే ప్రశ్నలతో ప్రభాస్ ను ఇబ్బంది పెట్టిన బాలయ్య అభిమానులకు ఫన్ అందించారు. ఈ ఎపిసోడ్ రెండవ భాగానికి సంబంధించి ప్రోమో ను కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రోమోలో బాలకృష్ణ.. గోపీచంద్ , ప్రభాస్ లను తనదైన స్టైల్ లో ప్రశ్నలు అడిగి ఇరకాటంలో పెట్టేశారు. ఇక ఈ ఎపిసోడ్ జనవరి 6 అంటే ఈరోజు స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉండగా ఈ బాహుబలి పార్ట్ 2 లో తన పెద్దనాన్న కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది.

గత కొన్ని నెలల క్రితం కృష్ణంరాజు అనారోగ్య సమస్యతో బాధపడుతూ స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఎవరు కూడా అంత త్వరగా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తన పెదనాన్నను తలచుకొని ఆయన ఎమోషనల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ ఎపిసోడ్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారని కూడా సమాచారం. ప్రస్తుతం ప్రభాస్, గోపీచంద్, బాలయ్య సంభాషణలకు సంబంధించి బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో చాలా వైరల్ గా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news