దారుణం: యూపీలో ఘోర ప్రమాదం… 9 మంది మృతి !

-

కాసేపటి క్రితం ఉత్తరప్రదేశ్ లో ఘోరాతి ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతటా విషాధచాయలు అలుముకున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రము లోని ఫతేపూర్ లో ఈ ఘటన జరిగింది. అటుగా వెళ్తున్న ఆటో ను ఒక ట్రయాంకర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది, ఈ రోడ్డు ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ఒక చిన్నారికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఇక ఆటో లో ఉన్న వారంతా ఘాతంపూర్ నుండి జెహానాబాద్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ రోడ్డు ప్రమాదం చూసిన వారు నిర్ఘాంతపోయినట్లు చెబుతున్నారు.

అక్కడిక్కడే మృతి చెందడంతో కొందరు షాక్ తిన్నారట. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ పూర్తి వివరాలను తెల్సుకుని మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున సహాయం చేయడానికి అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news