ఉపాసన మంచి మనసు.. ఏకంగా ఏనుగునే దత్తత తీసుకుంది..!

-

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన జులై 20న తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్ నెహ్రూ జువాలాజికల్ పార్క్‌ లో ఓ ఏనుగును దత్తత తీసుకున్నారు. రాణి అనే పేరున్న ఏనుగు పాలనకు అయ్యే ఖర్చును ఇచ్చింది ఉపాసన. ఏడాది పాటు ఆ ఏనుగుకు కావాల్సిన ఖర్చుల నిమిత్తం పార్క్ నిర్వాహకులకు 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చింది. అయితే ఉపాసన చేసిన పనికి పార్క్ నిర్వాహకులు కూడా అభినందించారు.

తనకు మూగ జీవాలంటే యిష్టమని.. వాటికి కావాల్సిన ఆలన పాలన చూసుకోవడం సంతృప్తినిస్తుందని తెలిపింది ఉపాసన. అలాగే పుట్టిన రోజు సందర్భంగా ఆర్థిక సాయం కూడా చేసింది ఉపాసన. అంతేకాదు కొన్ని గ్రామాలకు ఉచితంగా మందుల పంపిణి కూడా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news