కరోనా కేసుల్లో దూసుకుపోతున్న తెలుగు రాష్ట్రాలు..! ఎన్ని కేసులో తెలుసా..?

-

తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నాడు కొత్తగా 4,074 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 54 మంది చనిపోయారు. 1,335 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,724కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 696కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు 24,228 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28,800 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

అలాగే తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఏడుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,274కి చేరింది. 422 మంది చనిపోయారు. తెలంగాణలో ఇప్పటివరకు 34,323 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,530 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news