ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అసంతృప్తి..!

-

ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానం పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో చెప్పాలని.. అధిష్టానాన్ని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి నిలదీశారు. మేకను బలిచ్చే ముందు నీళ్లు పోస్తారు. ఉరివేసే ముందు చివరి కోరిక అడుగుతారు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇవాళ మీడియాతో మాట్లాడుతూ..  2018 నుంచి సొంతంగా కార్యక్రమాలు మాత్రమే చేశారు. బీఎల్ఆర్ అని.. బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నేత ఫొటోలు పెట్టుకుంటున్నాడని మండిపడ్డారు. పద్మారావు గౌడ్ నా తరువాత వచ్చారు. ఆయన మంత్రి అయ్యారు. గ్రేటర్ లో నేను ఒక్కడినే ఉద్యమకారుడిని అంటూ పేర్కొన్నారు. టికెట్ ఇచ్చే ముందు మాట్లాడలేదు.. ఇప్పుడు ఇంకా మాట్లాడలేదని తెలిపారు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. ఇంతకు బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నేత.. బీఆర్ఎస్ నేత.. తాను ఏమి తప్పు చేశాను.. నన్ను ఎందుకు బలి చేశారు ? అంటూ ఫైర్ అయ్యారు సుభాష్ రెడ్డి.  

Read more RELATED
Recommended to you

Latest news