బ్లాక్​ రోజ్ గా ఊర్వశీ రౌతేలా.. టాలీవుడ్ కి ఎంట్రీ

-

బాలీవుడ్​ నటి ఊర్వశీ రౌతేలా ప్రధానపాత్రలో.. దర్శకుడు మోహన్​ భరద్వాజ్​ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్లాక్​ రోజ్​’. దర్శకుడు సంపత్​ నంది రచనలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని.. శ్రీనివాసా సిల్వర్​స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కొవిడ్​ బారిన పడకుండా అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుని చిత్రీకరణ ప్రారంభించినట్లు నిర్మాత తెలిపారు.

Urvashi-Rautela
Urvashi-Rautela

దర్శకుడు సంపత్​ నంది మాట్లాడుతూ..”షేక్స్​పియర్​ రచించిన ‘ద మర్చంట్​ ఆఫ్​ వెనిస్’​లోని షైలాక్​ పాత్ర ఆధారంగా మహిళా ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘విచక్షణ, యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని సూత్రాన్ని జోడిస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా.. కళాదర్శకుడిగా ఆచార్య సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news