ప్రధాని పేరుతో నకిలీ పథకం- ముగ్గురి అరెస్ట్

-

కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో నకిలీ వెబ్​సైట్ నిర్వహిస్తోన్న ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలకు బీమా అంటూ ఏకంగా ప్రధాని పేరుతో నకిలీ పథకాన్ని సృష్టించి వేల మంది నుంచి డబ్బులు కాజేశారని పోలీసులు గుర్తించారు. ‘ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన’ అనే నకిలీ వెబ్​సైట్​ నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించినట్లు తెలుస్తోంది.

pm fake scheme
pm fake scheme

అరెస్టయిన వారిలో బిహార్​కు చెందిన నీరజ్​ పాండే, సువేందర్ యాదవ్​, ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఆదర్శ్ యాదవ్​ ఉన్నట్లు తెలిపారు. వీరు నిర్వహిస్తున్న వెబ్​సైట్​లో ఇప్పటివరకు 15 వేల మంది ప్రజలు తమ పేరును నమోదు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పంచాయతీ స్థాయిల్లో భారీ నెట్​వర్క్​ రూపొందించి మోసానికి పాల్పడినట్లు స్పష్టం చేశారు.జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తొలుత www.pmsvy-cloud.in వెబ్​సైట్​తో ‘ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన’ నకిలీ పథకాన్ని నిర్వహిస్తున్న నీరజ్​, ఆదర్శ్​ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం ‘పీఎం శిశు వికాస్​ యోజన’ను నిర్వహిస్తున్న సువేందర్​ను అదుపులోకి తీసుకున్నారు.ఈ నకిలీ వెబ్​సైట్ గురించి ‘ప్రెస్​ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఇది నకిలీ వెబ్​సైట్​ అని, ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన పేరుతో ఏ ప్రభుత్వ పథకం లేదని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news