తెలంగాణ సీఎం ఎవరో చెప్పేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి…!

-

తెలంగాణాలో ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరూ ఫలితాలు ఏ విధంగా వస్తాయన్న ఆలోచనలో పడిపోయారు. అధికారంలో ఉన్న BRS మాత్రం గెలవదని అన్ని సర్వేలు చెప్పడంతో ఇప్పడు అందరి దృష్టి కాంగ్రెస్ పై పడింది. కేసీఆర్ చేసిన పాలన కాంగ్రెస్ కు అనుకూలంగా మారిందని స్పష్టంగా తెలుస్తోంది. ఇక రేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండడంతో అందరూ తమకు తోచిన విధంగా అభిప్రాయాలను బయటకు చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నా మొక్కు రేపటితో తీరిపోనుందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను గడ్డం తీసేస్తానని అనుకున్నట్లు చెప్పాడు. ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగానే రానున్నాయని అందులో ఎటువంటి సందేహం లేదని ధీమాను వ్యక్తం చేశారు ఉత్తమ్.

ఇక సీఎం ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ విషయంలో మాత్రం తుది నిర్ణయం అధిష్టానం దే అంటూ మాట దాటేశారు. ఇక అందరూ అనుకుంటున్నట్లుగా రేవంత్ రెడ్డి లేదా సీతక్క లలో ఒకరిని సీఎం చేసే అవకాశం ఉందంటూ తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news