ఉత్తరాఖండ్‌లో ఇక రెండు రాజధానులు..!

-

ఉత్తరాఖండ్‌లో ఇక రెండు రాజధానులు ఏర్పాటు అయ్యాయి. అత్యంత వెనుకబడిన, పర్వత పంక్తులతో కూడిన గైర్‌సైన్ పట్టణాన్ని వేసవి రాజధానిగా అక్కడి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీరాణి మౌర్య సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ఉత్తరాఖండ్ తొలి వేసవి రాజధానిగా గైర్‌సైన్ చరిత్ర లిఖించింది. అయితే ప్రస్తుత రాజధాని డెహ్రాడూన్‌కు అదనంగా గైర్‌సైన్ కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news