సీఎం కేసీఆర్ దళిత ద్రోహి : మాజీ ఎంపీ వివేక్

-

సీఎం కేసీఆర్‌ వి6 అధినేత, బీజేపీ నాయకులు వివేక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని.. ఓట్ల కోసమే దళిత బంధు అని మండిపడ్డారు వివేక్. అంబెడ్కర్ పెట్టిన భిక్ష వల్లే తాను ప్రధాని అయ్యానని మోడీ చెప్పారని గుర్తు చేశారు. అంబెడ్కర్ కి భారత రత్న ఇచ్చి గౌరవించిన పార్టీ బీజేపీ అని తెలిపారు.

అంబెడ్కర్ కి మంత్రి పదవి ఇవ్వని, అంబెడ్కర్ ని ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహించారు. సీఎం అంబెడ్కర్ జయంతి కి ఈ రోజైన వెళ్ళాలి.. సీఎం గడీ నుండి బయటకు వచ్చి ఆ మహనీయుని స్మరించుకో అంటూ నిప్పులు చెరిగారు వివేక్‌. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తానని ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని.. అంబెడ్కర్ స్ఫూర్తి గా ఈ రోజు నుండి ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్‌ చేస్తున్నారని స్పష్టం చేశారు. మహనీయుని ఆశయాలు సాధించేందుకు ముందుకు వెళ్తామని ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version