గొల్లపూడికి వల్లభనేని వంశీ..నేను, కొడాలి నాని వస్తామంటూ సవాల్ !

-

గొల్లపూడి వద్ద ఉద్రిక్తత కొనసాగుతున్న క్రమంలో అక్కడికి వల్లభనేని వంశీ కూడా రావడం టెన్షన్ రేపుతోంది. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు టిడిపి, వైసిపి శ్రేణులు చేరుకున్నాయి. అయితే ఎన్టీఆర్ విగ్రహం వద్దకు రాగానే దేవినేని ఉమాను అరెస్ట్ చేసి వాహనంలో వివిధ ప్రాంతాల్లో తిప్పుతున్నారు పోలీసులు. ఇబ్రహీం మండలం ఈలప్రోలు వైపు దేవినేని ఉమాను తీసుకు వెళుతున్నారని అంటున్నారు. ఈ సమాచారం తెలుసుకుని పోలీస్ వాహానాన్ని తంగిరాల సౌమ్య, అనుచరులు అడ్డుకున్నారు.

ఇక గొల్లపూడి చేరుకున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని ఉమ.. మంత్రిగా దోచుకున్నారని విమర్శించారు. పోలవరం కాంట్రాక్టు లో మెక్కిన సొమ్మును కక్కిస్తామన్న ఆయన రోడ్డు మీద బహిరంగ చర్చ వల్ల శాంతి భద్రతలకు ఇబ్బందని ఏ టివి స్టూడియోలో చర్చకు అయినా మేము సిద్దమని సవాల్ చేశారు. ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చిస్తామన్న ఆయన  ఉమా కోరుకున్న స్టూడియో కి నేను, కొడాలి నాని వస్తామని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news