పేర్ని నాని, పోసానిలపై నిర్భయ చట్టం కేసులు పెట్టాలి :వంగలపూడి అనిత

-

జన సేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న వ్యవహారం పై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పేర్ని నాని, పోసాని కృష్ణ మురళి ల పై నిర్భయ చట్టం 509సెక్షన్ కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు వంగలపూడి అనిత. మహిళల్ని కించ పరిచేలా అధికార పార్టీ నేతలు మాట్లాడటం సిగ్గు చేటు అని నిప్పులు చెరిగారు.

పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ విమర్శలకు చేతనైతే సమాధానం చెప్పాలి కానీ కుటుంబ సభ్యుల్ని నోటికొచ్చినట్లు తిట్టడం ఎంత వరకు సమంజసం ? అని ప్రశ్నించారు వంగలపూడి అనిత. సినిమాల్లో, రాజకీయాల్లో, ఉద్యోగాల్లో మహిళలు ఎక్కడున్నా గౌరవించడం మంత్రి పేర్ని నాని, పోసాని కృష్ణ మురళి లు నేర్చు కోవాలని హెచ్చరించారు.

మహిళల్ని కించ పరుస్తున్న తీరును ఖండించక పోతే వైసీపీ పేటీఎం గ్రామ సింహాలు రోడ్ల పైకి వచ్చి అందరి పైనా మొరుగుతాయని పేర్కొన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఈ గ్రామ సింహాలకు స్క్రిప్ట్ అందుతోందా..? అని సిఎం జగన్ పై నిప్పులు చెరిగారు వంగలపూడి అనిత.

Read more RELATED
Recommended to you

Latest news