ప్ర‌ముఖ ఓటీటీకి `వార‌సుడు` డిజిట‌ల్ రైట్స్‌.. ఇంత‌కీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

-

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ‘వారిసు’ ఫైనల్ గా ఈరోజు తమిళ్ వెర్షన్ లో అయితే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సాలీడ్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా అన్ని భాషల్లో కూడా భారీ బిజినెస్ ని జరుపుకుంది. ఇక ఈ డీల్ లో సినిమా ఓటిటి హక్కులు కూడా భారీ దరికి అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ కావడంతో ఈ చిత్రం అఫీషియల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ పై అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని అయితే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోవారు సొంతం చేసుకున్నారు. మరికొన్ని నెలల తర్వాత అయితే ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news