రాజమౌళి ఛాలెంజిని తిరస్కరించిన రామ్ గోపాల్ వర్మ..

-

సోషల్ మీడియాలో గ్రీన్ ఇండియా ఛాలెంజి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు మొక్కలు నాటుతూ, మరి కొందరికి ఆ ఛాలెంజిని స్వీకరించమని కోరుతున్నారు. ఆ విధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళికి ఛాలెంజి విసిరారు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్న రాజమౌళి, తన యూనిట్ మొత్తానితో కలిసి మొక్కలు నాటాడు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, వివి వినాయక్, పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మలకి గ్రీన్ ఇండియా ఛాలెంజి విసిరాడు. ఐతే సంచలనాలకి మారుపేరుగా ఉన్న వర్మ, రాజమౌళి రిక్వెస్ట్ ని తిరస్కరించాడు. మట్టి ముట్టుకోవడం తనకి ఇష్టం ఉండదని, తనలాంటి స్వార్థపరుడు మొక్కలు నాటే పనులు చెయ్యడని, గ్రీన్ ఇండియా ఛాలెంజిని తిరస్కరిస్తున్నానని తెలిపాడు. సినిమా, ప్రమోషన్ తప్ప మిగతా ఎలాంటి పనుల్లో పెద్దగా కనిపించని వర్మ, మొక్కలు నాటుతాడని రాజమౌళి నిజంగానే అనుకున్నాడా, లేదా వర్మ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దామనే ఆసక్తితోనే ఛాలెంజి విసిరాడా అన్నది ఆసక్తికరంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news