బిగ్ బాస్ పై వర్మ సంచలన కామెంట్స్..!?

-

బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తున్న బిగ్ బాస్. ఈ షోకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ షో చివరి దశకు చేరుకుంది. ఇక షోలో ఎవరు విజేతగా నిలుస్తారని అభిమానులు అంత ఎదురుచూస్తున్నారు. మరోవైపు కాంటెస్ట్ లో టెన్షన్ పెరుగుతుంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

RGV-Bigg-Boss
RGV-Bigg-Boss

రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సమాజానికి అర్థంకాని ఓ వ్యక్తి. ఏదైనా విషయంపై ఒకరోజు ఇచ్చిన ప్రకటనపై నిలబడి ఉండడు. మరోరోజు అదే విషయంపై విభిన్నమైన కామెంట్ చేసి..మనసు మార్చుకున్నా అంటాడు. తాను సినిమాలు తీస్తాడు. చూస్తే చూడండి లేదంటే లేదంటాడు. “మనషుల్లో వర్మ వేరయ్యా” అనే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసుకోగలిగాడు.

ఇక ఒకనొక టైమ్‌లో ట్రెండ్ సృష్టించిన ఈయన..ఇప్పుడు కొత్తగా ఏమైనా తీసి ఉంటాడా అని సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు తలనొప్పి తెప్పిస్తున్నాడు. ఇంత ఇంటిలిజెంట్ ఇలా ఎందుకు మారిపోయాడో ఎవరికీ అంతుచిక్కని సమస్యగా మారింది. తాజాగా బిగ్ బాస్ షోపై వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

అయితే తాను బిగ్ బాస్ షో ఎక్కువగా చూడనని… గతంలో సన్నీలియోన్ హిందీ బిగ్‌బాస్‌లో వచ్చినప్పుడు మాత్రమే చూశానని వ్యాఖ్యానించారు. కేవలం సన్నిలియోన్ కోసం కొన్ని ఎపిసోడ్ మాత్రమే చూడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తెలుగులో ఇప్పటివరకు చూడలేదని, వ్యాఖ్యాతగా రమ్మని పిలిచినా వెళ్లడానికి ఇంట్రస్ట్ లేదని తెలిపారు.

ఇక బిగ్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చెయ్యడం వర్మకు ఇష్టమేనట. అయితే ఆయన కొన్ని షరతులు కూడా ఉన్నాయి అంటున్నారు. “బిగ్‌బాస్ ఇంటిలోకి 16 మంది అమ్మాయిలు, నన్ను మాత్రమే పంపిస్తే నేను వెళ్తాను. 16 మంది అమ్మాయిలు తప్ప మరొకరు ఉండకూడదు. 500 కెమెరాలు ఉన్నా ఫర్వాలేదు. నైట్ విజన్ కెమెరాలున్నా లైట్ తీసుకుంటాను” అని రామ్ గోపాల్ వర్మ తన మార్క్ వ్యాఖ్యలు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news