బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వాసంతి..!

-

బిగ్ బాస్ ఆరవ సీజన్లో 21 మంది కంటెస్టెంట్లలో బేబీ డాల్ గా గుర్తింపు తెచ్చుకుంది వాసంతి కృష్ణన్. సీరియల్ యాక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె గురించి పెద్దగా ఎవరికి పరిచయం లేదు. కానీ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో పాపులారిటీని దక్కించుకుంది. తన అందచందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు వాసంతి కోసమే బిగ్బాస్ చూసిన వాళ్లు కూడా ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. అంతలా తన అందంతో ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ ఊహించని విధంగా గత ముందు వారం ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది.

ఎలిమినేట్ అయిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా గడిపేస్తోంది వాసంతి. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట్లో బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే అంచనా ఉండేది. కానీ ఎప్పుడైతే గీతూ, సూర్య ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యారో ఆ తర్వాత మాలో టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియక చాలా ఇబ్బంది పడే వాళ్ళము. నిజానికి హౌస్ లో ఆ టెన్షన్ వల్లే నేను హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు 53 కేజీలు ఉండేదాన్ని కానీ ఇప్పుడు 47 కేజీలు ఉన్నాను. హౌస్ లోకి ఫుడ్డు కూడా చాలా వస్తుంది. కానీ ఆ టెన్షన్ వల్లే బరువు తగ్గుతాము అంటూ వాసంతి తెలిపింది.

అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లో ఒకరిగా లేకపోయినా ఆ తర్వాత స్థానంలో ఉంటానని అనుకున్నాను. కానీ అది జరగలేదు. కనీసం నేను ఎందుకు ఎలిమెంట్ అయ్యానో నాకు కూడా తెలియదు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది వాసంతి.

Read more RELATED
Recommended to you

Latest news