వాస్తు: భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను ఇలా పెంచుకోవచ్చు..!

-

చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటారు. అప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా సరే తొలగిపోతుంది అని నమ్ముతారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోతుంది పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. మరి వాటి కోసమే ఇప్పుడు తెలుసుకుందాం.

 

వాస్తు శాస్త్రం ప్రకారం భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు ఎలా పెరగాలి అనే దాని గురించి పండితులు ఈరోజు చెప్పారు. చాలా మంది భార్యాభర్తలు తరచూ గొడవలు పడటం… వారి మధ్య ఏదైనా సమస్య కలగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే అలా కాకుండా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగాలంటే ఈ విధంగా చేయమని పండితులు అంటున్నారు.

భార్యా భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగాలంటే పడక గదిలో కర్పూరం వెలిగించాలి అని పండితులు చెప్పారు. దీనివల్ల ప్రశాంతత కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు దృఢంగా మారుతాయి. అలానే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరగాలంటే ఇంట్లో కర్పూరాన్ని వెలిగించండి. ఒకవేళ కనుక పడకగదిలో కర్పూరాన్ని వెలిగించక పోతే పడక గదిలో కర్పూరాన్ని కనీసం వుంచండి.

ఇలా చేయడం వల్ల సంబంధాలు దృఢంగా మారుతాయి. గొడవలు తొలగిపోయి ఆనందం కలుగుతుంది. అయితే కర్పూరం వెలిగించేటప్పుడు వెండి బౌల్ లో కానీ ఇత్తడి దాంట్లో కానీ వేసి వెలిగించండి. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఇంట్లో సమస్యలు కూడా తొలగిపోయి. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఆనందంగా కూడా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news