కేసీఆర్ ను టచ్ చేసి చూడండి…మా దమ్ము ఏంటో చూపిస్తాం : మంత్రి వేముల

-

దమ్ముంటే కేసీఆర్ ను టచ్ చేసి చూడండి… మా దమ్ము ఏంటో చూపిస్తామని సవాల్ విసిరార్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బీజేపీ పాలితరాష్ట్రల్లో రైతుబంధు ఉందా ? తెలంగాణలో వ్యవసాయ భూములకు భారీగా ధరలు.. ఆంధ్రాలో డమాల్ అంటూ వ్యాఖ్యానించారు. ఎర్రిలేసిన కుక్కల్లాగా అర్వింద్, సంజయ్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ బుడ్డారఖాన్… సంజయ్ మెంటల్… అర్వింద్ ఏమి లేనోడు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

మధ్యప్రదేశ్ నుంచి ఒక కుక్క వచ్చి కేసీఆర్ మీద మొరిగింది… అస్సాం నుంచి వచ్చి ఇంకొడు మొరుగుతున్నాడని మండిపడ్డారు. ఒకనాడు ఆంధ్రోళ్లు తెలంగాణ భూములు కొనేది. నేడు తెలంగాణ రైతులు ఆంధ్రాలో భూములు కొంటున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్టాల నుంచి కూలీలుగా తెలంగాణకు రావడం లేదా ? తెలంగాణ వాళ్ళు బీహార్, మదే ప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ కు వెళ్తున్నారా ? అని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రిలు ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఇట్లా ఉంది.. ఇద్దరు అబద్దాలకోర్లు మొరుగుతున్నారు… ఒక్కడికి నెత్తి మీద ఉన్నది. లోపల లేదని బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు. నిజామాబాదోడికి నెత్తిమీద లేదు, లోపల కూడా లేదంటూ అరవింద్ పై నిప్పులు చెరిగారు. గెలిచిన 5 రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని మాటతప్పిన సిగ్గులేనివాడు అర్వింద్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news