ఆ కబ్జా బీజేపీ నేత పనే.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

-

ఉప్పుగూడ కాళికా మాతా దేవాలయ భూములను సందర్శించిన సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప్పుగూడ కాళికా మాత దేవాదాయ శాఖ కు సంబంధించిన స్థలాలను కబ్జాకు పాల్పడిన శేరి నర్సింహా రెడ్డి బీజేపీ నాయకుడా ? కాదా బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి ఎవరు వచ్చినా పబ్లిసిటీ కోసం బీజేపీ నాయకులు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంను సందర్శిస్తున్నారని నువ్వు బండి సంజయ్ అయితే నేను రాముడి భక్తుణ్ణి హనుమంతుడునని అది నా పేరులోనే ఉందన్నారు.

v hanumanth rao and his wife victory over corona virus
 

గల్లీలో ఫైట్ లు చేస్తారు.. ఢిల్లీలో దోస్తీ చేస్తారని మజ్లీస్, బీజేపీ పార్టీ లు దొందు దొందేనని ఆయన ఆరోపించారు. దివంగత నేత అలె నరేంద్ర, ఎంఐఎంలు కుమ్ముక్కయి తలాబ్ కట్టాను అమ్ముకోలేదా అని ప్రశ్నించారు ? ఈజీ మనీ కోసం కబ్జాలకు పాల్పడి సంపాదించిన అక్రమ్ సొమ్ముతో బట్టలు మారుస్తున్నారని, పార్టీలలో చేరుతు డబ్బులు సంపాదిస్తున్నారని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news