ప‌నుల్లో వేగం పెంచండి..!

-

ప‌నులు వేగవంతం చేయాల‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పాఠ‌శాల‌లు ప్రారంభ‌మ‌య్యేలోపు నాడు- నేడు ప‌నులు పూర్తికావాల్సిందేన‌ని చిల‌క‌లూరిపేట‌ శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. చిల‌క‌లూరిపేట రూర‌ల్ మండ‌లం మురికిపూడిలోని శ్రీమ‌తి కందిమ‌ళ్ల శార‌దాంబ జిల్లాప‌రిష‌త్ ఉన్న‌తపాఠ‌శాల‌తోపాటు, ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో నిర్వహిస్తున్న నాడు-నేడు ప‌నుల‌ను ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని ఆదివారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ‌ర్షాకాలం వ‌స్తున్న నేప‌థ్యంలో నాడు- నేడు ప‌నుల్లో జాప్యం జ‌ర‌గ‌కుండా ఇప్ప‌టి నుంచి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్పారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను మౌలిక స‌దుపాయాల‌తో తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యంగా త‌మ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నాడు-నేడు ప‌థ‌కాన్ని తీసుకొచ్చార‌ని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news