Vijay Antony : ప్రమాదం తర్వాత తొలిసారి విజయ్ ఆంటోనీ ట్వీట్

-

బిచ్చగాడు సీక్వెల్ సినిమా చిత్రీకరణలో ఆ సినిమా హీరో విజయ్ ఆంటోనీ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం విషమించిందని.. ఐసీయూలో చికిత్స పొందుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన విజయ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే విజయ్ ఆరోగ్య పరిస్థితిపై అతడి భార్య క్లారిటీ ఇచ్చారు.

అభిమానులు ఆందోళన చెందుతున్నారని తెలిసిన విజయ్ ఆంటోనీ ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారిగా ట్వీట్ చేశారు. ప్రమాదంలో తన ముక్కు, దవడ తీవ్రంగా గాయపడ్డాయని.. ఇటీవలే వాటికి శస్త్రచికిత్స చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. అభిమానులెవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు.

“మలేసియాలో బిచ్చగాడు -2 షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో నా ముక్కు, దవడకు దెబ్బలు తగిలాయి. ఇటీవలే మేజర్ సర్జరీ కూడా జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. త్వరగా కోలుకుని మీ ముందుకు వస్తాను. నా కోసం ప్రార్థించిన వాళ్లందిరికీ ధన్యవాదాలు.”  – విజయ్ ఆంటోనీ

Read more RELATED
Recommended to you

Exit mobile version