Asia Cup 2022 : ఇండియా-పాక్ మ్యాచ్ లో సందడి చేసిన ‘లైగర్‌’

-

ఆసియా కప్‌ 2022 లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌ లో టీమిండియా.. 5 వికెట్ల తేడాతో పాక్‌ పై గెలిచింది. మొదట పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌట్‌ కాగా.. ఇండియా ఆ లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించింది.

పాక్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ రిజ్వాన్‌ 43 పరుగులు చేసి.. రాణించారు. అయితే.. ఈ ఇండియా – పాక్‌ మ్యాచ్‌ లో లైగర్‌ హీరో విజయ్‌ దేవరకొండ సందడి చేశాడు. తన తాజా సినిమా లైగర్‌ ప్రమోషన్స్‌ లో భాగంగా దుబాయ్‌ లో సందడి చేశాడు విజయ్‌.

మ్యాచ్‌ కు ముందు హోస్ట్‌ లతో కలిసి మాట్లాడిన విజయ్‌ దేవరకొండ..టీమిండియా ఈ మ్యాచ్‌ లో గెలవాలని ఆకాంక్షించాడు. అలాగే.. కోహ్లీ హాఫ్‌ సెంచరీ చేస్తాడని జోస్యం చెప్పాడు. ఆ తర్వాత.. టీమిండియా మాజీ ఆల్‌ రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తో సరదగా చిట్‌ చాట్‌ చేశాడు విజయ్‌. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news