గుర్తింపు లేని జనసేనను ఎలా అనుమతిస్తారని.. విజయసాయిరెడ్డి ఫైర్..!

-

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం మొదటి రోజు గుర్తింపు పొందిన పార్టీల తో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. పలువురు పార్టీ నేతలు సిఇసి అధికారులని కలవడం జరిగింది. తాజాగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలానే పవన్ కళ్యాణ్ కూడా సిఈసి ని కలిశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ని కూడా సిఈసి బృందాన్ని కలిసి రాష్ట్రం లో ఓటర్ల జాబితాలో అవకతవకల మీద కంప్లైంట్ చేయడం జరిగింది.

తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ గుర్తింపు లేని పార్టీ అటువంటి పార్టీని తెలుగుదేశం పార్టీతో పాటుగా అనుమతిస్తారు అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. జనసేన పార్టీ గుర్తు గ్లాస్ సింబల్ అని, అది జనరల్ సింబల్ అని అన్నారు. వైసిపికి బోగిస్ ఓట్లు ఉన్నాయని పదేపదే ప్రస్తావిస్తున్నారని ఒక వ్యక్తికి బోగస్ ఓట్లు ఎన్ని ఉన్నాయో ఎలా ఎలా తెలుస్తుందో చెప్పాలి అని అన్నారు విజయ సాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version