కుప్పంలో మళ్లీ గెలుస్తావా..? విజయసాయి రెడ్డి సవాల్..?

-

మాజీ సీఎం చంద్రబాబుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. ప్రజలు మళ్లీ తననే కోరుకుంటున్నారని కలువరిస్తున్న చంద్రబాబు కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి గెలవాలని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. “ప్రజలంటే కుల మీడియా అధిపతులు, మీ బంధుగణం, మోచేతి నీళ్లు తాగే చెంచాలు కాదు చంద్రబాబు గారూ.. అంటున్నారు విజయసాయిరెడ్డి.

13 జిల్లాల్లోని ఐదు కోట్ల మందిని ప్రజలు అని అంటారని విజయిసాయిరెడ్డి పేర్కొన్నారు. కుప్పం నుంచి మళ్లీ మీరు గెలిస్తే.. నిజంగానే ప్రజలు మిమ్మల్ని కలవరిస్తున్నారని భావిస్తారంతా’ అని ట్వీట్ చేశారు. నాలుగు నెలల్లోనే సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 80 శాతం హామీలను నెరవేర్చారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

‘వంశ పారంపర్యం అర్చకత్వానికి ఆమోదం తెలపడం ద్వారా ఆలయాలపైన ఆధారపడి జీవిస్తున్న వేలాది అర్చక కుటుంబాలకు వైయస్‌ జగన్ భరోసా కల్పించారని తెలిపారు. గతంలో కూల్చేసిన ఆలయాలు, ప్రార్థనా స్థలాలన్నిటినీ పునర్నిర్మించే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు.

చంద్రబాబు ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారంలో కోల్పోయి ఆరు నెలలు కాకముందే.. మళ్లీ అధికారంపై మమకారం కలిగే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్ ను గెలిపించిన ప్రజలు తప్పు చేశామని భావిస్తున్నారని అంటున్నారు. ఈ డైలాగులు సహజంగానే వైసీపీ నేతలకు కోపం తెప్పిస్తున్నాయి. ఇలాంటి సవాళ్లకు దారి తీస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news