వంగవీటి రంగాను హత్య చేసిన దొంగ…వెలగపూడి రాము – విజయసాయి

-

వంగవీటి రంగాను హత్య చేసిన దొంగ…వెలగపూడి రాము అంటూ విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగాను హత్య చేసి…విశాఖకు పారిపోయి వచ్చి భూకబ్జాలు చేస్తున్న దొంగ…వెలగపూడి రాము. రుషికొండ గ్రామం సర్వే నం.21లో 379 గజాల ప్రభుత్వ పొరంబోకు భూమిని కబ్జా చేస్తే నేనే కంప్లైంట్ ఇచ్చి గోడ పగలకొట్టించి ప్రభుత్వానికి అప్పగించా. ఇలాంటి నీ కబ్జా లీలలు కోకొల్లలు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు విజయ సాయిరెడ్డి.


ముసలి చంద్రం నాయుడు, ఆయన దొంగల ముఠా కళ్లన్నీ విశాఖ వనరుల మీదనే. పేదలు వలస పోతుంటే ఆనందించారు. పరిశ్రమలు పెడతామని వస్తే బాబు అమరావతికి రమ్మనేవాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆయన హయాంలోనే బీజం పడింది. రక్షకులెవరో, భక్షకులేవరో ప్రజలకు తెలుసని మరో ట్వీట్‌ లో పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో చంద్రంకు ఏం పని? వేల ఎకరాల ఆసామి గీతం మూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు? వంగవీటి రంగా హంతకుడు వెలగపూడి విశాఖ ఎందుకొచ్చాడో చెప్పు. డ్రామోజీ డాల్ఫిన్ హోటల్ కట్టినప్పుడు నోరెందుకు లేవలేదు? వీళ్లంతా మిడతల దండులా వచ్చి విశాఖలో 80% భూములు ఆక్రమిస్తే ‘కమ్మ’గా ఉందర్రా కూనా? అని ప్రశ్నించారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news