వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కేంద్రంలో మరో కీలక పదవి

-

వైసిపి రాజ్య సభ సభ్యులు విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి దక్కింది. పార్లమెంటు లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎన్నికయ్యారు. వరుసగా రెండవసారి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఎన్నికయ్యారు.

కేంద్ర ప్రభుత్వ ఆదాయవ్య ఖాతాలను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలించనుంది. అయితే ఈ కమిటీలో విజయసాయిరెడ్డి ఉండడం గమనార్హం. ఇక ఈ ఎన్నికపై విజయ సాయి రెడ్డి స్పందించారు. తనకు ఇలాంటి అవకాశం కల్పించిన కేంద్రానికి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news