కేజ్రీవాల్ అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు.. కేసీఆర్‌పై రాములమ్మ సెటైర్లు

-

కేజ్రీవాల్ అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నాడంటూ తెలంగాణ రాష్ట్ర సిఎం కేసీఆర్‌ పై రాములమ్మ సెటైర్లు వేసింది. సీఎం కేసీఆర్‌కి రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నరు. ఎవరూ పట్టించుకోకున్నా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద కేసీఆర్ పడిగాపులు కాస్తున్నరు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వద్ద అపాయింట్‌మెంట్ కోసం…వైఫల్యాలు, విషాదాలే తప్ప తెలంగాణకి ఒరిగిందేమీ లేదు. ప్ర‌జ‌ల‌ను అన్ని ర‌కాలుగా క‌ష్టనష్టాల‌పాలు చేస్తున్న కేసీఆర్ స‌ర్కార్‌కు తెలంగాణ ప్ర‌జానీకం త‌గిన బుద్ధి చెప్పడం ఖాయమని విమర్శించారు.

ఇష్టారీతిన అన్నింటిపైనా చార్జీలు పెంచి, పేద, సామాన్య, మధ్య తరగతి వారిపై అధిక భారం మోపుతున్నరు. ఎన్నో త్యాగాలు, ఆకాంక్షల నడుమ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేళ్ళు గడిచిందని ఫైర్ అయ్యారు. ఆరంభం నుంచీ అధికారంలో ఉన్న అధికార టీఆరెస్ పాలనలో…సీఎం కేసీఆర్ బొక్కబోర్లా పడ్డాడు. ప్రభుత్వోద్యోగులకు జీతాలు, సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వలేని అప్పులకుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిన ఘనత కేసీఆర్‌దే.

చట్టాలను మార్చి అప్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ చర్యలను కాగ్ తప్పు పడుతోందన్ని అగ్రహించారు. సీఎం కేసీఆర్ వేచి చూడడం తెలంగాణ‌కే సిగ్గుచేటు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పట్టించుకోకుండా… పక్క రాష్ట్రాల్లోని రైతు కుటుంబాలకు చెక్కులు పంచడం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news