వైఎస్ షర్మిళ విషయంలో విజయశాంతి ఏమన్నారో తెలుసా…

-

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిళపై సామాజిక మాధ్యమంలో చేస్తున్న అసత్య ప్రచారంపై ఆమె రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా విజయశాంతి ఆమెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో షర్మిళ అనుభవిస్తున్న మానసిక బాధను చూస్తుంటేనే అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిళకు ఓ సినిహీరోతో సంబంధం అంటగట్టడం నీచమైన చర్య అని మండిపడ్డారు.

సోషల్‌ మీడియా సైతం మహిళల పాలిట విలన్‌గా మారుతోందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ రంగంలోనూ మహిళలను అణగదొక్కాలనే దోరణి ఇంకా పోలేదని ఆమె పేర్కొన్నారు. దశాబ్దాల పాలు సినిమా, రాజకీయాల్లో కొనసాగుతున్న మహిళగా ఇది తన అభిప్రాయమన్నారు. సోషల్ మీడియాపై పోరాటం చేసే రోజులు వచ్చాయన్నారు. టెక్నాలజీని మంచి కంటే కూడా చెడుకు ఎక్కువగా వాడుతున్నారని ఆమె తెలిపారు. ఏది ఏమైన ఓ మహిళగా షర్మిళపై వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news