బిజినెస్ క్లాస్ లో మైనా పక్షి.. ప్యాసెంజర్లు షాక్..!

-

పక్షి విమానంలో ప్రయాణించడం చూశారా ఎప్పుడైనా? మీరు చూసి ఉండకపోవచ్చు కదా. కానీ.. ఓ మైనా పక్షి విమానంలోని బిజినెస్ క్లాస్ లో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో చోటు చేసుకున్నది. ఆ విమానం సింగపూర్ నుంచి లండన్ బయలుదేరింది. ప్రయాణికులంతా తమ సీట్లలో కూర్చున్నారు. ఇంతో ఆ పక్షి బిజినెస్ క్లాస్ లో ప్రత్యక్షమైంది. దీంతో షాక్ అయ్యారు ప్రయాణికులు. ప్రయాణికులతో పాటే ఆ పక్షి కూడా ప్రయాణం చేసి లండన్ చేరుకున్నది.

ఈ ఘటన జనవరి 7 న జరిగిందట. అయితే.. ఆ పక్షి విమానంలో ప్రయాణిస్తుండగా వీడియో తీసిన ఓ ప్రయాణికుడు ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక.. నెటిజన్లు ఊరుకుంటారా? ఆ పక్షి ఎంత అదృష్టవంతురాలో.. ఏకంగా బిజినెస్ క్లాస్ లోనే ప్రయాణించే అదృష్టం దక్కింది తనకు.. అంటూ కామెంట్లు చేశారు. అయితే.. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ పక్షి వీడియోను సోషల్ మీడియా నుంచి తీసేశారు. బహుశా… సింగపూర్ ఎయిర్ లైన్స్.. అనవసర వివాదాలు ఎందుకని ఆ వీడియోను తొలగించి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news