ఒక దూబే ఎన్‌కౌంటర్‌.. మరో దూబే పరార్..!

-

కాన్పూర్ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే మరోసారి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఫరీదాబాద్‌లో ఉన్న బద్కాల్‌ చౌక్‌లోని ఓ‌ హోటల్‌లో వికాస్‌ దూబే ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో హర్యానా క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన పోలీసులు మంగళవారం రాత్రి ఆ హోటల్‌పై దాడి చేశారు. కానీ అతడు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు. సీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అతడు హోటల్‌ పరిసరాల్లో తిరిగినట్లు రికార్డయ్యింది. దీంతో సీసీటీవీ హార్డ్‌డిస్క్‌ ను పోలీసులు తమవెంట తీసుకుపోయారు.

అతడి మకాం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఇదే సమయంలో.. వికాస్‌ దూబే ప్రధాన సహాయకుడు అమర్‌ దూబేని ఎన్‌కౌంటర్‌ చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఈ రోజు ఉదయం అమర్‌ దూబేను ప్రత్యేక పోలీసులు కాల్చి చంపారు. కాన్పూర్‌ ఘటనలో ప్రధాన నిందితుల్లో ఒకరైన అమర్‌ దూబే బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని ఉత్తరప్రదేశ్‌ అదనపు డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news