విక్రమార్కుడు మూవీకి సీక్వెల్ కథ సిద్ధం : నిర్మాత రాధామోహన్

-

రాజమౌళి-రవితేజ కాంబోలో తెరకెక్కిన విక్రమార్కుడుకు సీక్వెల్ కథను రచయిత విజయేంద్రప్రసాద్ పూర్తి చేశారని నిర్మాత రాధామోహన్ వెల్లడించారు. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన బజరంగీ భాయిజాన్-2 స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యిందని తెలిపారు.

నటీనటుల ఎంపిక పనులు జరుగుతున్నాయని, త్వరలోనే సినిమాల షూటింగ్ మొదలు పెడతామని చెప్పారు. ‘బజరంగీ భాయిజాన్ 2′ కథ సల్మాన్ఫాన్కు వినిపించే సమయం కోసం ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు. దీంతో ఈ బ్లాక్ బస్టర్ చిత్రాల సీక్వెల్స్ త్వరలోనే రానున్నట్లు ఖాయమైంది. విక్రమార్కుడు సీక్వెలు రాజమౌళినే దర్శకత్వం వహించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల రవితేజ ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. రాజమౌళితో కలిసి పని చేయడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని వెల్లడించారు. భారతీయ సినీ పరిశ్రమలోని వారందరూ ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news