దారుణం: యువతీయువకులు మాట్లాడుతున్నారని కొట్టిన గ్రామస్థులు

-

ఓవైపు దేశంలో కరోనా మహమ్మారి తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే… మరోవైపు దేశంలో నానాటికి హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. కొందరైతే చిన్న చిన్న విషయాలకు ప్రాణాలు తీసేంత వరకు వెళ్తున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి తాజాగా మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

attack
attack

ఈ విషయంకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… రాష్ట్రంలోని జాబువా జిల్లాలోని కలీ దేవి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు వేరే గ్రామం యువతి తో మాట్లాడుతూ కనపడ్డారని ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులు వారిద్దరిని దారుణంగా కొట్టారు. తమ గ్రామానికి చెందిన యువకుడు దుద్ది అనే గ్రామంలోని యువతితో మాట్లాడడం తెలిసిన కారణంగానే గ్రామస్తులు కొట్టినట్టు పోలీస్ అధికారులు తెలియజేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం మాట్లాడానందుకే మనుషుల్ని చచ్చిపోయేలా కొట్టడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్ కు  పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news